ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- April 12, 2026
దోహా: ఖతార్ లో ఆహార భద్రతా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. మొదటగా ఆయన అలనామ్ యానిమల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ మరియు ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ను సందర్శించారు.
అనంతరం తన పర్యటనలో భాగంగా ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ ను తనిఖీ చేశారు. అక్కడ వివిధ మార్కెట్ సౌకర్యాలను పరిశీలించరు. కూరగాయలు, పండ్లు, తాజా చేపలు, రెడ్ మీట్ సమృద్ధిగా లభించడాన్ని గమనించారు. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఉత్పత్తులు తగినంత పరిమాణంలో మరియు అధిక నాణ్యతతో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు .
ఉత్పత్తి మరియు సరఫరా రంగాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణను మెరుగుపరచాలనే పురపాలక మంత్రిత్వ శాఖ ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి మరియు పౌరులు, నివాసితులకు ప్రాథమిక ఆహార వస్తువుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి దోహదపడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







