ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- April 12, 2026
దోహా: ఖతార్ లో ఆహార భద్రతా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. మొదటగా ఆయన అలనామ్ యానిమల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ మరియు ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ను సందర్శించారు.
అనంతరం తన పర్యటనలో భాగంగా ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ ను తనిఖీ చేశారు. అక్కడ వివిధ మార్కెట్ సౌకర్యాలను పరిశీలించరు. కూరగాయలు, పండ్లు, తాజా చేపలు, రెడ్ మీట్ సమృద్ధిగా లభించడాన్ని గమనించారు. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఉత్పత్తులు తగినంత పరిమాణంలో మరియు అధిక నాణ్యతతో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు .
ఉత్పత్తి మరియు సరఫరా రంగాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణను మెరుగుపరచాలనే పురపాలక మంత్రిత్వ శాఖ ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి మరియు పౌరులు, నివాసితులకు ప్రాథమిక ఆహార వస్తువుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి దోహదపడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









