ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- April 12, 2026
రియాద్: ఈస్ట్-వెస్ట్ (East–West) పైప్లైన్ ద్వారా రోజుకు సుమారు ఏడు మిలియన్ బ్యారెళ్ల (mbpd) పూర్తి పంపింగ్ సామర్థ్యాన్ని పునరుద్ధరించినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.దీంతో మనిఫా (Manifa) ఫీల్డ్ నుండి రోజుకు సుమారు 3,00,000 బ్యారెళ్ల మేర ప్రభావితమైన ఉత్పత్తిని తిరిగి పొందినట్లు పేర్కొంది. ఇందుకు చేపట్టిన నిర్వహణ మరియు సాంకేతికపరమైన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని సౌదీ ఇంధన మంత్రిత్వ తెలిపింది. ఈ ప్రక్రియ అంతా చాలా తక్కువ సమయంలోనే పూర్తయిందని ప్రకటించింది.
ఏప్రిల్ 9న దాడుల కారణంగా ఇంధన రంగంలోని కొన్ని సదుపాయాలపై ప్రభావం పడిందని, ఇందులో ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ద్వారా రోజుకు సుమారు 7,00,000 బ్యారెళ్ల పంపింగ్ సామర్థ్యం కోల్పోయినట్లు అంతకుముందు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మనిఫా క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు సుమారు 3,00,000 బ్యారెళ్లు తగ్గడం, అలాగే ఖురైస్ (Khurais) క్షేత్రంలో ఉత్పత్తిపై రోజుకు సుమారు 3,00,000 బ్యారెళ్ల మేర ప్రభావితం అయినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నది.
కాగా, ఖురైస్ ఫీల్డ్ కు సంబంధించి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తయిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









