అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- April 13, 2026
దోహా: విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో.. ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పలు మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా అవసరమైన సర్టిఫికేట్లకు సంబంధించిన నిబంధనలను వెల్లడించడంతోపాటు కొన్ని నిర్దిష్ట వర్గాల విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం..విజిట్ వీసా (visit visa) పై ఖతార్కు వచ్చే విద్యార్థులకు వారి నివాస అనుమతి (residency) ప్రక్రియలను పూర్తి చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇవ్వబడుతుంది. అవసరమైతే ఈ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
కొత్తగా వచ్చిన విద్యార్థులకు అండగా నిలిచే లక్ష్యంతో తీసుకున్న మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత వయో పరిమితి ప్రమాణాలకు సరిపోని విద్యార్థులు కూడా, పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైతే, వారి ఇటీవలి విద్యా సర్టిఫికేట్ల ఆధారంగా అడ్మిషన్లను కల్పిస్తారు. వీటితోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ధృవపత్రాల ధ్రువీకరణ (attestation) లేకుండా వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు, ఆ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి రెండు నెలల అదనపు గడువు (grace period) ఇవ్వబడుతుంది.ఖతార్ లో దివ్యాంగులు మరియు అభ్యాస వైకల్యాలు (learning difficulties) కలిగిన విద్యార్థుల ప్రవేశానికి అనుమతించదగిన గరిష్ట వయో పరిమితిని కూడా మంత్రిత్వ శాఖ పెంచింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







