ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- April 13, 2026
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన కీలక శాంతి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటలకు పైగా సాగిన ఈ చర్చలు చివరికి విఫలమయ్యాయి.
నెతన్యాహు ఫోన్ కాల్ ఆరోపణ
ఈ చర్చలు విఫలమవడానికి కారణం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ఫోన్ కాల్ అని ఇరాన్ ఆరోపించింది. చర్చల మధ్యలో నెతన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేసినట్లు తెలిపింది.
దీంతో చర్చల దృష్టి ఇరాన్ అంశం నుంచి ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లిపోయిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ పేర్కొన్నారు.
ఈ ఆరోపణల పై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇరాన్ మాత్రం తాము చిత్తశుద్ధితో చర్చలకు హాజరయ్యామని తెలిపింది.
అమెరికా షరతులు
చర్చల సందర్భంగా అమెరికా కొన్ని కీలక డిమాండ్లను ఇరాన్ ముందుంచినట్లు సమాచారం.
- హర్మూజ్ జలసంధిలో నౌకలకు పూర్తి స్వేచ్ఛ
- ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమం నిలిపివేత
- యురేనియం నిల్వలను అప్పగించడం
ఈ షరతులను ఇరాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి
ఈ చర్చలు విఫలమవడంతో రెండు వారాల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. మరో తొమ్మిది రోజుల్లో ఆ ఒప్పందం గడువు ముగియనుంది.
చమురు ధరల పై ప్రభావం
ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 95 డాలర్ల నుంచి 119 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







