తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- April 13, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి ఆరా తీశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా సంక్షోభానికి మూలకారణాలను పరిష్కరించడంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్ట సూత్రాలపై ఆధారపడిన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారాలను సాధించడం లక్ష్యంగా సాగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు కింగ్ సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







