తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- April 13, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి ఆరా తీశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా సంక్షోభానికి మూలకారణాలను పరిష్కరించడంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్ట సూత్రాలపై ఆధారపడిన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారాలను సాధించడం లక్ష్యంగా సాగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు కింగ్ సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







