తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- April 13, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి ఆరా తీశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా సంక్షోభానికి మూలకారణాలను పరిష్కరించడంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్ట సూత్రాలపై ఆధారపడిన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారాలను సాధించడం లక్ష్యంగా సాగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు కింగ్ సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









