తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!

- April 13, 2026 , by Maagulf
తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!

మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి ఆరా తీశారు.  ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా సంక్షోభానికి మూలకారణాలను పరిష్కరించడంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్ట సూత్రాలపై ఆధారపడిన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారాలను సాధించడం లక్ష్యంగా సాగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు కింగ్ సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com