రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- April 13, 2026
రియాద్: 2024లో 79 శాతంగా ఉన్న ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా.. 2025 నాటికి మొత్తం రిటైల్ చెల్లింపులలో 85 శాతానికి చేరుకుందని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది. ఈ విజయం జాతీయ చెల్లింపు వ్యవస్థలలోని వృద్ధిని ప్రతిబింబిస్తుందన్నారు.
ఎలక్ట్రానిక్ లావాదేవీల సంఖ్య 2024లో 12.6 బిలియన్లుగా ఉండగా, 2025 నాటికి అది 14.6 బిలియన్లకు చేరుకుందని తెలిపింది. Mada చెల్లింపు వ్యవస్థ ద్వారా.. ముఖ్యంగా పాయింట్-ఆఫ్-సేల్ (POS) మరియు ఈ-కామర్స్ లావాదేవీలలో లావాదేవీల పరిమాణం పెరగడం, అలాగే ఇతర జాతీయ చెల్లింపు వ్యవస్థలలో వచ్చిన వృద్ధి కారణంగానే ఈ పురోగతి సాధ్యమైందని SAMA పేర్కొంది.
ఈ పెరుగుదల ఎలక్ట్రానిక్ చెల్లింపుల వినియోగం నిరంతరం విస్తరణను మరియు రోజువారీ లావాదేవీలలో వాటి పాత్ర పెరుగుతుండటాన్ని సూచిస్తుంది. ఇటీవల సౌదీ అరేబియాలో ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల వినియోగంలో వేగవంతమైన వృద్ధి కనిపించిందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ముఖ్యంగా నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ముందుకు తీసుకెళ్లడం అనే 'సౌదీ విజన్ 2030' లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయని SAMA పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ









