అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
- April 14, 2026
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
అమరావతి: ఏపీలో క్వాంటం నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. అమరావతిలో క్వాంటం ఫెసిలిటీస్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భారత్ లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా మేధా టవర్స్ లోని 1క్యూ క్వాంటం ఫెసిలిటీని చంద్రబాబు ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలాగా సదుపాయం చేశారు. ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మైనస్ 273 డిగ్రీల సెంటిగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పని చేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనలలో కీలకం కానున్నాయి.
తాజా వార్తలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
- గెలిచిన 5 నెలల్లోపే సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్
- అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
- మే 1 నుంచి టీటీడీలో కొత్త రూల్స్..!









