ప్రాంతీయ పరిణామాలపై ఒమన్,ఖతార్ చర్చలు..!!
- April 15, 2026
మస్కట్: కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తాజా ప్రాంతీయ పరిణామాలపై టెలిఫోన్ లో చర్చించారు. ఈ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను, అలాగే ఆయా దేశాలు మరియు ప్రజలపై భద్రతా, ఆర్థిక పర్యవసానాలను పంచుకున్నారు. సముద్ర మార్గాల భద్రతను కాపాడటానికి మరియు అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు కట్టుబడి, దౌత్య మార్గాల ద్వారా కొనసాగుతున్న సంఘర్షణను పరిష్కరించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు.
అలాగే, కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో కూడా టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. తాజా ప్రాంతీయ పరిణామాలను మరియు దేశాల భద్రతపై, ప్రజల రక్షణపై వాటి ప్రభావాలను సమీక్షించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడంలో ఒమన్ సుల్తానేట్ చేస్తున్న కృషిని జపాన్ ప్రధానమంత్రి ప్రశంసించారు. దౌత్య మార్గాల ద్వారా సంఘర్షణను పరిష్కరించడానికి మరియు ఒక తుది ఒప్పందానికి చేరుకోవడానికి తమ దేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









