IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- April 16, 2026
IPL 2026: ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ ఖాతాలో మరో గెలుపు చేరింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల టార్గెట్ ను పంజాబ్ అలవోకగా చేజ్ చేసింది. 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది పంజాబ్. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సింగ్ 39 బంతుల్లోనే 88 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు బాదాడు.
ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది 4వ విజయం. ఇంత వరకు ఒక్క ఓటమి లేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ కి వరుసగా నాలుగో పరాజయం. 5 మ్యాచులు ఆడిన ముంబై నాలుగింటిలో ఓటమిపాలైంది. ముంబై పై గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో టాప్ కి దూసుకెళ్లింది పంజాబ్.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









