యుద్ధాన్ని పూర్తిగా ముగించడంపైనే ఫోకస్.. ఖతార్
- April 15, 2026
దోహాః కేవలం హోర్ముజ్ జలసంధి సమస్యపై దృష్టి పెట్టకుండా.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ముగించడంపైనే ఫోకస్ చేయాలని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్-అన్సారీ కోరారు. “మేము గతంలో పలుమార్లు చెప్పినట్లుగా, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిష్కారం రెండూ అవసరం. అయితే, ఈ దశలో ఇది ఇంకా చాలా తొందరపాటు అవుతుందని నేను భావిస్తున్నాను. మేము ప్రస్తుతం కాల్పుల విరమణ సాధించడం, ఈ ప్రాంతంలో యుద్ధాన్ని ముగించడం మరియు కొనసాగుతున్న ఈ సంఘర్షణ అంచు నుండి ప్రాంతాన్ని వెనక్కి తీసుకురావడంపై దృష్టి సారించాము.” అని అల్-అన్సారీ వీక్లీ మీడియా సమావేశంలో తెలిపారు.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, దాని మూసివేత వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను నివారించడానికి ఖతార్ తన భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతోందని అల్-అన్సారీ పేర్కొన్నారు. సముద్ర మార్గాలను ఆయుధాలుగా వాడుకోవద్దని హెచ్చరించారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆపడానికి చెల్లింపుల విషయమై ఖతార్, ఇరాన్ల మధ్య చర్చలు జరిగాయన్న వదంతులను ఆయన ఖండించారు. ఖతార్ ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలను అల్-అన్సారీ కొట్టిపారేశారు. "ఏ దాడుల నుంచైనా మేము మా దేశాన్ని రక్షించుకుంటాము. ఈ దాడులను ఆర్థికంగా ఆపుతామన్న ఏ మాట అయినా పూర్తిగా అబద్ధం. దాని లక్ష్యం కేవలం నా దేశ ప్రతిష్టను దెబ్బతీయడమే." అని ఆయన వివరించారు.
మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ కూడా లెబనాన్పై తన బాంబు దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో ఆ దేశంలో కనీసం 2,089 మంది మరణించారు. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన ప్రకటనలో మొదట లెబనాన్లో కాల్పుల విరమణను చేర్చగా, ఇజ్రాయెల్ దానిని తిరస్కరించింది. లెబనాన్లోని పరిణామాలపై ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ దాడులను ఖతార్ ఖండిస్తోందని అల్-అన్సారీ పునరుద్ఘాటించారు. అదే సమయంలో వాటిని అంతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









