నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు
- April 15, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం (TDP) తమ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు పొలిట్బ్యూరో సభ్యుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ మార్పుల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం నారా లోకేష్ పదోన్నతి.
గత కొంత కాలంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన నారా లోకేష్కు ఇప్పుడు మరింత కీలక బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఆయన, గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి క్యాడర్లో మంచి పట్టు సాధించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఈ కమిటీలను రూపొందించారు:
రాష్ట్ర అధ్యక్షుడు: టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు తన పదవిలో కొనసాగనున్నారు.
రాష్ట్ర కమిటీ: మొత్తం 185 మందితో భారీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది.
పొలిట్బ్యూరో: పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరోలో సీనియర్లకు, యువతకు సమ ప్రాధాన్యత కల్పించారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









