అమెరికా దిగ్బంధనం: హోర్ముజ్ జలసంధి వద్ద ఉత్కంఠ
- April 15, 2026
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఇరాన్ లక్ష్యంగా అమెరికా విధిస్తున్న నౌకా దిగ్బంధనం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. అమెరికా ఆంక్షలను ధిక్కరించి వెళ్లాలని చూసిన నౌకలు చుక్కెదురై వెనుదిరుగుతున్నాయి. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ‘రిచ్ స్టార్రీ’ అనే ట్యాంకర్, హోర్ముజ్ జలసంధిని దాటి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ ట్యాంకర్ సుమారు 2,50,000 బ్యారెళ్ల మెథనాల్ను మోసుకెళ్తోంది. ఇది చైనాకు చెందిన షాంఘై జువాన్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందినది. ఇరాన్తో వ్యాపార సంబంధాల కారణంగా దీనిపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది.అమెరికా యుద్ధ నౌకల హెచ్చరికలతో ఈ ట్యాంకర్ బుధవారం తిరిగి గల్ఫ్ ప్రాంతానికే వెనుదిరిగింది.
శాంతి చర్చలు విఫలమైన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ దిగ్బంధనం అత్యంత కఠినంగా అమలువుతోంది. దిగ్బంధనం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో ఒక్క నౌక కూడా నిబంధనలను అతిక్రమించి వెళ్లలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దళాల ఆదేశాలతో దాదాపు ఆరు నౌకలు తమ మార్గాన్ని మార్చుకుని ఇరాన్ ఓడరేవులకు తిరిగి వెళ్లాయి.
ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థలో తీవ్ర ఆందోళన నెలకొంది. యుద్ధానికి ముందు రోజుకు 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ఇప్పుడు రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. యుద్ధ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, నౌకలకు ఇన్సూరెన్స్ ఇచ్చే సంస్థలు భారీగా ప్రీమియంలను పెంచడం లేదా రక్షణ కల్పించడానికి నిరాకరించడం చేస్తున్నాయి. అలిసియా’ వంటి భారీ చమురు ట్యాంకర్లు ఇప్పటికీ ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









