బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- April 16, 2026
మనామా: బహ్రెయిన్ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లిబియా ఆంక్షల కమిటీ పదవీకాలాన్ని ఆగస్టు 1, 2027 వరకు పొడిగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.
లిబియాపై మండలి పెన్హోల్డర్గా యునైటెడ్ కింగ్డమ్ సమర్పించిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. లిబియా స్థిరత్వానికి, దాని వనరుల పరిరక్షణకు, ఆర్థిక అభివృద్ధికి తన మద్దతును పునరుద్ఘాటిస్తూ బహ్రెయిన్ అనుకూలంగా ఓటు వేసింది.
ఈ తీర్మానంలో ముడి మరియు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులతో సహా లిబియా చమురు అక్రమ ఎగుమతిని నిరోధించే చర్యలు ఉన్నాయి. ఇది దేశ సహజ వనరులను పరిరక్షించే ప్రయత్నాలను కూడా బలపరుస్తుంది. లిబియన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. జాతీయ ఆస్తులు లిబియా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా యంత్రాంగాలను పటిష్టం చేయనుందని పేర్కొన్నారు.
లిబియా ఆంక్షల కమిటీని మొదటగా 2011లో తీర్మానం 1970 కింద ఆయుధాల నిషేధం, ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధాలు వంటి ఆంక్షలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు. లిబియా నుండి చట్టవిరుద్ధంగా చమురును ఎగుమతి చేసే ప్రయత్నాలను అరికట్టడానికి 2014లో కమిటీ అధికార పరిధిని విస్తరించారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









