సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- April 16, 2026
కువైట్: సౌదీ అరేబియాలో రాబోయే హజ్ సీజన్ను పురస్కరించుకొని కువైట్లోని భారత పౌరులకు రాయబార కార్యాలయం ద్వారా సౌదీ ట్రాన్సిట్ వీసాలను పొందేందుకు వీలు కల్పించిన సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుదారులు తమ సౌదీ ట్రాన్సిట్ వీసా అభ్యర్థనలను రాయబార కార్యాలయం ద్వారా పంపడానికి వీలు కల్పించిన ఈ ఏర్పాటును తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేసినట్లు తెలిపింది.
సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించాలని యోచిస్తున్న భారత పౌరులు.. ఏవైనా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ముందు ఇమ్మిగ్రేషన్, ట్రాన్సిట్ విధానాలు మరియు వీసా సంబంధిత అంశాలపై తాజా సమాచారం కోసం నేరుగా వారి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.
ఈ కాలంలో పాత విధానం కింద సౌదీ ట్రాన్సిట్ వీసాల కోసం ఎలాంటి కొత్త అభ్యర్థనలను స్వీకరించబోమని లేదా ప్రాసెస్ చేయబోమని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









