సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- April 16, 2026
కువైట్: సౌదీ అరేబియాలో రాబోయే హజ్ సీజన్ను పురస్కరించుకొని కువైట్లోని భారత పౌరులకు రాయబార కార్యాలయం ద్వారా సౌదీ ట్రాన్సిట్ వీసాలను పొందేందుకు వీలు కల్పించిన సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుదారులు తమ సౌదీ ట్రాన్సిట్ వీసా అభ్యర్థనలను రాయబార కార్యాలయం ద్వారా పంపడానికి వీలు కల్పించిన ఈ ఏర్పాటును తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేసినట్లు తెలిపింది.
సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించాలని యోచిస్తున్న భారత పౌరులు.. ఏవైనా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ముందు ఇమ్మిగ్రేషన్, ట్రాన్సిట్ విధానాలు మరియు వీసా సంబంధిత అంశాలపై తాజా సమాచారం కోసం నేరుగా వారి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.
ఈ కాలంలో పాత విధానం కింద సౌదీ ట్రాన్సిట్ వీసాల కోసం ఎలాంటి కొత్త అభ్యర్థనలను స్వీకరించబోమని లేదా ప్రాసెస్ చేయబోమని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







