ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- April 16, 2026
దోహా: మిడిలీస్టులో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ డొనాల్డ్ ట్రంప్.. అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా అంతర్జాతీయ సముద్ర భద్రతపై ఇటీవలి ఉద్రిక్తతల ప్రభావం మరియు ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా చైన్ ల స్థిరత్వంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో ఖతార్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని, అలాగే అంతర్జాతీయ భాగస్వాములకు తన బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉంటుందని హెచ్హెచ్ అమీర్ పునరుద్ఘాటించారు.
అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయడం, అలాగే ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతను పరిరక్షించే విధంగా సంక్షోభాలను పరిష్కరించడానికి దౌత్యపరమైన మార్గాలను ప్రాథమిక మార్గంగా ఎంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ మధ్యవర్తిత్వంలో ఖతార్ దేశం పోషిస్తున్న పాత్రను, స్థిరత్వానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ప్రశంసించారు. ముఖ్యంగా ఇంధన భద్రత మరియు ప్రపంచ మార్కెట్ స్థిరత్వం వంటి వివిధ అంశాలపై ఖతార్ తో సమన్వయం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఆసక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







