యూఏఈ వ్యాప్తంగా స్కూల్ బస్సుల నిర్వహణ తాత్కాలిక వాయిదా!
- April 16, 2026
యూఏఈ: యూఏఈలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, నర్సరీలు మరియు కిండర్ గార్టెన్లలో స్కూల్ బస్సు సర్వీసులను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పాఠశాలల్లో నేరుగా తరగతులు (In-person learning) ప్రారంభించడానికి జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రవాణా సంస్థలు మరియు మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకుంటూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను (Safety Standards) నిర్ధారించిన తర్వాతే బస్సులను రోడ్డెక్కించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని ప్రతి వారం సమీక్షిస్తారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు, రవాణా సేవలను తిరిగి ప్రారంభించే తేదీని అధికారిక ఛానెళ్ల ద్వారా వెల్లడిస్తారు.
విద్యార్థుల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, పూర్తి సురక్షితంగా ఉండేలా చూడటమే ఈ వాయిదా వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతానికి బస్సు సౌకర్యం లేనందున, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థుల తల్లిదండ్రులు సొంత వాహనాల్లో లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపాల్సి ఉంటుంది. లేదా ఆయా పాఠశాలలు ఇచ్చే తదుపరి సూచనల వరకు వేచి చూడాలి.
--బాజీ షేక్(యూఏఈ)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









