యూఏఈ వ్యాప్తంగా స్కూల్ బస్సుల నిర్వహణ తాత్కాలిక వాయిదా!
- April 16, 2026
యూఏఈ: యూఏఈలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, నర్సరీలు మరియు కిండర్ గార్టెన్లలో స్కూల్ బస్సు సర్వీసులను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పాఠశాలల్లో నేరుగా తరగతులు (In-person learning) ప్రారంభించడానికి జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రవాణా సంస్థలు మరియు మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకుంటూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను (Safety Standards) నిర్ధారించిన తర్వాతే బస్సులను రోడ్డెక్కించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని ప్రతి వారం సమీక్షిస్తారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు, రవాణా సేవలను తిరిగి ప్రారంభించే తేదీని అధికారిక ఛానెళ్ల ద్వారా వెల్లడిస్తారు.
విద్యార్థుల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, పూర్తి సురక్షితంగా ఉండేలా చూడటమే ఈ వాయిదా వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతానికి బస్సు సౌకర్యం లేనందున, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థుల తల్లిదండ్రులు సొంత వాహనాల్లో లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపాల్సి ఉంటుంది. లేదా ఆయా పాఠశాలలు ఇచ్చే తదుపరి సూచనల వరకు వేచి చూడాలి.
--బాజీ షేక్(యూఏఈ)
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







