యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- April 16, 2026
యూఏఈ: మిడిలీస్టులో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా.. యూఏఈలోని ప్రైవేట్ స్కూళ్లతోపాటు నర్సరీలు, కిండర్ గార్డెన్ల బస్సు సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, తదుపరి నిర్ణయం వీక్లీ సమీక్ష సందర్భంగా తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. పాఠశాల బస్సు సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అధికారిక, ఆమోదిత ఛానెళ్ల ద్వారా ప్రకటించబదుతుందని తెలిపింది.
ఒక నెల కంటే ఎక్కువ రోజులపాటు రిమోట్ లెర్నింగ్ క్లాసుల తర్వాత, యూఏఈ వ్యాప్తంగా విద్యార్థులు ఏప్రిల్ 20 నుండి ప్రత్యక్ష తరగతులకు హాజరు కావడం ప్రారంభిస్తారు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ కు మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- ఖతార్ బ్యాంకుల మొత్తం ఆస్తులు QR 2.173 ట్రిలియన్లు..!!
- బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!
- ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!









