ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- April 16, 2026
న్యూజిలాండ్: ఎయిర్ ప్రయాణంలో కొత్త అనుభవం అందించేందుకు ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్సులు, రైళ్లలో కనిపించే స్లీపర్ సదుపాయాన్ని ఇప్పుడు విమానాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
దీర్ఘకాలిక విమాన ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ‘స్కైనెస్ట్ పాడ్స్’ పేరుతో ప్రత్యేక స్లీపర్ బెడ్లను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా 17 గంటల పాటు సాగే లాంగ్-హాల్ ఫ్లైట్లలో ఈ సదుపాయం ప్రయాణికులకు ఉపయోగపడనుంది.
వచ్చే నవంబర్ నుంచి న్యూయార్క్–ఆక్లాండ్ మార్గంలో నడిచే విమానాల్లో ఈ స్కైనెస్ట్ పాడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక విభాగంలో ఒకేసారి ఆరుగురు ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ప్రతి ప్రయాణికుడు సుమారు 4 గంటల పాటు ఈ స్లీపర్ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులకు అవకాశం ఇవ్వబడుతుంది. ఈ సేవను ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగానే బుకింగ్ సమయంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో విమాన ప్రయాణంలో నిద్ర, విశ్రాంతి వంటి అంశాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









