యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- April 16, 2026
యూఏఈ: మిడిలీస్టులో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా.. యూఏఈలోని ప్రైవేట్ స్కూళ్లతోపాటు నర్సరీలు, కిండర్ గార్డెన్ల బస్సు సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, తదుపరి నిర్ణయం వీక్లీ సమీక్ష సందర్భంగా తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. పాఠశాల బస్సు సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అధికారిక, ఆమోదిత ఛానెళ్ల ద్వారా ప్రకటించబదుతుందని తెలిపింది.
ఒక నెల కంటే ఎక్కువ రోజులపాటు రిమోట్ లెర్నింగ్ క్లాసుల తర్వాత, యూఏఈ వ్యాప్తంగా విద్యార్థులు ఏప్రిల్ 20 నుండి ప్రత్యక్ష తరగతులకు హాజరు కావడం ప్రారంభిస్తారు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ కు మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!









