ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- April 17, 2026
న్యూ ఢిల్లీ: దేశ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. దశాబ్దాల కల అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్సభలో ఓటింగ్ దశలో చతికిలపడింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కీలక బిల్లుకు సభలో అవసరమైన మద్దతు లభించలేదు.. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. కానీ, జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీనితో బిల్లు ఆమోదానికి కావాల్సిన మద్దతు లభించకపోవడంతో ఇది వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ కీలక బిల్లుపై జరిగిన ఓటింగ్లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన వారిలో మూడింట రెండొంతుల మంది, అంటే 352 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ప్రభుత్వం ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో విఫలమైంది.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









