ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- April 17, 2026
న్యూ ఢిల్లీ: దేశ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. దశాబ్దాల కల అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్సభలో ఓటింగ్ దశలో చతికిలపడింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కీలక బిల్లుకు సభలో అవసరమైన మద్దతు లభించలేదు.. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. కానీ, జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీనితో బిల్లు ఆమోదానికి కావాల్సిన మద్దతు లభించకపోవడంతో ఇది వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ కీలక బిల్లుపై జరిగిన ఓటింగ్లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన వారిలో మూడింట రెండొంతుల మంది, అంటే 352 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ప్రభుత్వం ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో విఫలమైంది.
తాజా వార్తలు
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!









