దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- April 18, 2026
దోహా: అంటాల్యా దౌత్య ఫోరం (Antalya Diplomacy Forum) లో ఎమీర్ పాల్గొని ప్రసంగించారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలోనూ, పరస్పర మానవ అవగాహనను పెంపొందించడంలోనూ ఈ ఫోరం సమావేశాలు ఒక అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫోరం విశేషాలను తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించారు.ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన అనిశ్చితుల నేపథ్యంలో భవిష్యత్తును తీర్చిదిద్దడం వంటి అంశాలపై ఈ ఫోరంలో చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాను రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో పాటు, అనేక సోదర మరియు మిత్ర దేశాల అధినేతలను, ప్రభుత్వ ప్రముఖులను కలిసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫోరం సంభాషణలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, పరస్పర మానవ అవగాహనను మరింత గాఢతరం చేయడంలోనూ దోహదపడుతుందని ఎమీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







