జైల్లో అనూహ్య ఘటన

- August 05, 2016 , by Maagulf
జైల్లో అనూహ్య ఘటన

అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన నిందితుడిపై తోటి ఖైదీలు దాడి చేసి చంపేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సుపేలా పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న అజయ్‌ దేవంగన్‌(34) అనే వ్యక్తి కన్న తల్లినే వేధించిన ఆరోపణలపై అరెస్టయ్యాడు. ఈ రోజు ఉదయం జైలు సిబ్బంది చూసేసరికి తనగదిలో చనిపోయి ఉన్నాడు. తోటి ఖైదీలు ఇద్దరు అతడిపై దాడిచేసి తీవ్రంగా కొట్టి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com