హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- April 19, 2026
కువైట్ః ఆరోగ్య మరియు భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు హవల్లీ గవర్నరేట్లోని ఒక ఆహార సంస్థను మూసివేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆదేశించింది. ప్రజారోగ్య ప్రమాణాలను పాటించకపోవడం, ఆమోదించబడిన ఆరోగ్య అవసరాలను ఉల్లంఘించడం, సంస్థ లైసెన్స్లో పేర్కొన్న పరిమితులకు మించి స్థలాన్ని అనధికారికంగా ఉపయోగించడం వంటివి ఈ ఉల్లంఘనలలో ఉన్నాయని అథారిటీ పేర్కొంది. చెల్లుబాటు అయ్యే ఆరోగ్య ధృవీకరణ పత్రం లేకుండా ఒక కార్మికుడు ఆహారాన్ని తయారు చేస్తున్నాడని, అలాగే అవసరమైన ధృవీకరణ పత్రాన్ని పొందకుండా మరో కార్మికుడిని నియమించుకోవడం వంటి వాటిని కూడా ఉల్లంఘననలో ఉన్నాయని ఇన్స్పెక్టర్లు వెల్లడించారు.
ఆరోగ్య నిబంధనలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవడానికి నిరంతరం ముమ్మర తనిఖీలను కొనసాగిస్తామని అథారిటీ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి ఉల్లంఘనదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









