సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- June 03, 2026
హైదరాబాద్: అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ (MCRHRD)లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ తెలంగాణ ప్రత్యేకతలని ఆయన వివరించారు.
తెలంగాణలో సమాచార సాంకేతికత, ఫార్మా, బయోటెక్నాలజీ, తయారీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ రంగాల్లో దక్షిణాఫ్రికా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తమను ఆకట్టుకుందని చెప్పారు. భవిష్యత్తులో వాణిజ్యం, పరిశ్రమలు, సాంకేతికత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఆసక్తి ఉన్నట్లు వెల్లడించారు.
ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీ తెలంగాణ-దక్షిణాఫ్రికా ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలకు కొత్త ఊపునివ్వనున్నట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







