సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- June 03, 2026
హైదరాబాద్: అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ (MCRHRD)లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ తెలంగాణ ప్రత్యేకతలని ఆయన వివరించారు.
తెలంగాణలో సమాచార సాంకేతికత, ఫార్మా, బయోటెక్నాలజీ, తయారీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ రంగాల్లో దక్షిణాఫ్రికా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తమను ఆకట్టుకుందని చెప్పారు. భవిష్యత్తులో వాణిజ్యం, పరిశ్రమలు, సాంకేతికత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఆసక్తి ఉన్నట్లు వెల్లడించారు.
ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీ తెలంగాణ-దక్షిణాఫ్రికా ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలకు కొత్త ఊపునివ్వనున్నట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









