'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- April 19, 2026
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం కరీంనగర్ టౌన్,నగరంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన వారాహి హోమియోపతి చికిత్స కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొలగాని శ్రీనివాస్
మేయర్-నగర పాలక సంస్థ కరీంనగర్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన హోమియోపతి వైద్యం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను మూలాల నుండి నయం చేయవచ్చని, ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ వైద్యం సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు.
వారాహి హోమియోపతి ప్రతినిధులు డి.నాగరాజు, అనిల్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని, రోగుల ఆరోగ్య సమస్యలను మూలాల నుండి పరిష్కరిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ చైర్మన్, మార్కెటింగ్ హెడ్ సహా డాక్టర్ శ్రావణ్ కుమార్, శ్రీధర్, గంగాధర్, ఇతర ముఖ్య నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







