'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- April 19, 2026
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం కరీంనగర్ టౌన్,నగరంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన వారాహి హోమియోపతి చికిత్స కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొలగాని శ్రీనివాస్
మేయర్-నగర పాలక సంస్థ కరీంనగర్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన హోమియోపతి వైద్యం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను మూలాల నుండి నయం చేయవచ్చని, ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ వైద్యం సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు.
వారాహి హోమియోపతి ప్రతినిధులు డి.నాగరాజు, అనిల్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని, రోగుల ఆరోగ్య సమస్యలను మూలాల నుండి పరిష్కరిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ చైర్మన్, మార్కెటింగ్ హెడ్ సహా డాక్టర్ శ్రావణ్ కుమార్, శ్రీధర్, గంగాధర్, ఇతర ముఖ్య నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







