బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- April 19, 2026
విరుధునగర్: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సాత్తూరు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సంఘటన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా రసాయనాలు కలుపుతున్న సమయంలో మంటలు చెలరేగి వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని పలు గదులు దెబ్బతిన్నాయి. మృతుల్లో పలువురు మహిళా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను విరుధునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బాణసంచా యూనిట్ గోవందనల్లూరుకు చెందిన ముత్తు మాణిక్యం అనే వ్యక్తికి చెందినదిగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జిల్లా కలెక్టర్తో ఫోనులో మాట్లాడారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు రామచంద్రన్, తంగమ్ తెన్నరసును ఆదేశించారు..
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









