బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- April 19, 2026
విరుధునగర్: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సాత్తూరు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సంఘటన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా రసాయనాలు కలుపుతున్న సమయంలో మంటలు చెలరేగి వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని పలు గదులు దెబ్బతిన్నాయి. మృతుల్లో పలువురు మహిళా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను విరుధునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బాణసంచా యూనిట్ గోవందనల్లూరుకు చెందిన ముత్తు మాణిక్యం అనే వ్యక్తికి చెందినదిగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జిల్లా కలెక్టర్తో ఫోనులో మాట్లాడారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు రామచంద్రన్, తంగమ్ తెన్నరసును ఆదేశించారు..
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







