ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- April 21, 2026
యూఏఈః అమెరికా-ఇరాన్ చర్చల కోసం ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణంలో.. ఇరాన్ తో సంబంధాలపై యూఏఈ అధ్యక్షుడి సలహాదారు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టర్కీలోని అంటాల్యా డిప్లొమసీ ఫోరమ్లో యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ మాట్లాడారు. ప్రపంచ దేశాలు కొత్త దశ రూపురేఖలను, మారుతున్న రాజకీయ పరిస్థితులను, అలాగే భవిష్యత్తులో ఏమి జరగబోతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
"సమీక్ష మరియు హామీలు లేకుండా సంబంధాలలో మునుపటి స్థాయికి తిరిగి రావడం అసాధ్యం. ఉద్రిక్తత, బెదిరింపులు, దురాక్రమణను ఒక కొత్త వాస్తవంగా అంగీకరించడం ఆమోదయోగ్యం కాదు." అని ఆయన అన్నారు. యుఏఈ విషయానికొస్తే, గల్ఫ్ దేశాలు మరియు వారి ప్రజలపై ఇరాన్ క్రూరమైన దురాక్రమణ చేసిందని, ఇరాన్ తో ఇకపై మునుపటి సంబంధాలు అసాధ్యమని గర్గాష్ అన్నారు.
ఇజ్రాయెల్తో పోల్చినా కూడా ఇరాన్ దాడులకు యూఏఈయే అత్యంత ఎక్కువగా గురైన దేశమని వెల్లడించారు. ఈ దాడుల తీవ్రతను ఏ హేతుబద్ధమైన లెక్కలతోనూ వివరించలేమని ఆయన వాదించారు. యూఏఈపై 2,800కు పైగా ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లు దాడి చేశాయని, వాటిలో 96 శాతాన్ని యూఏఈ అడ్డుకుందని ఆయన తెలిపారు. తమ దేశ రక్షణ సంసిద్ధతను ఇరాన్ తీవ్రంగా తప్పుగా అంచనా వేసిందనడానికి ఇది సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి అధికారులకు రాసిన ఒక లేఖలో అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో టెహ్రాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశానికి కలిగిన నష్టాలకు ఇరాన్ నుండి "పూర్తి పరిహారం" ఇవ్వాలని బహ్రెయిన్ కోరింది. ఇరాన్ దాడులపై ఒక గల్ఫ్ దేశం ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. మార్చి 25న ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా మరియు జోర్డాన్ దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









