యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- April 22, 2026
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్లను కలిపే హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తయింది. ఇది ప్రాంతీయ రవాణా అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయిగా నిల్వనుంది. ఎతిహాద్ రైల్, ఒమన్ రైల్ మరియు ముబడాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ రైల్వే ప్రాజెక్టు, పూర్తిగా పూర్తయ్యాక సుమారు 238 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. జెబెల్ హఫీత్ పేరు మీదుగా దీనికి హఫీత్ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. ఈ నెట్వర్క్ రెండు దేశాలను కలిపే ఒక కీలకమైన మార్గంగా మారనుంది.
ఇప్పటివరకు 27 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పనులు పూర్తయ్యాయని, అలాగే పెద్ద గాయాలు లేకుండా 10 మిలియన్ సురక్షిత పని గంటలు పూర్తి చేసినట్టు ప్రాజెక్ట్ డెవలపర్లు తెలిపారు. అల్ ఐన్, అల్ బురైమి, సోహార్ మరియు వాడి అల్ జిజ్జితో సహా పలు కీలక ప్రదేశాలలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రైలు మార్గం కార్యరూపం దాల్చిన తర్వాత ఇది యూఏఈ - ఒమన్ మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, సఫ్లై చైన్ ను బలోపేతం చేసి, ఆర్థిక సమైక్యతను మెరుగుపరుస్తుందని తద్వారా దీర్ఘకాలిక ప్రాంతీయ వృద్ధికి
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







