యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- April 22, 2026
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్లను కలిపే హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తయింది. ఇది ప్రాంతీయ రవాణా అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయిగా నిల్వనుంది. ఎతిహాద్ రైల్, ఒమన్ రైల్ మరియు ముబడాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ రైల్వే ప్రాజెక్టు, పూర్తిగా పూర్తయ్యాక సుమారు 238 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. జెబెల్ హఫీత్ పేరు మీదుగా దీనికి హఫీత్ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. ఈ నెట్వర్క్ రెండు దేశాలను కలిపే ఒక కీలకమైన మార్గంగా మారనుంది.
ఇప్పటివరకు 27 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పనులు పూర్తయ్యాయని, అలాగే పెద్ద గాయాలు లేకుండా 10 మిలియన్ సురక్షిత పని గంటలు పూర్తి చేసినట్టు ప్రాజెక్ట్ డెవలపర్లు తెలిపారు. అల్ ఐన్, అల్ బురైమి, సోహార్ మరియు వాడి అల్ జిజ్జితో సహా పలు కీలక ప్రదేశాలలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రైలు మార్గం కార్యరూపం దాల్చిన తర్వాత ఇది యూఏఈ - ఒమన్ మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, సఫ్లై చైన్ ను బలోపేతం చేసి, ఆర్థిక సమైక్యతను మెరుగుపరుస్తుందని తద్వారా దీర్ఘకాలిక ప్రాంతీయ వృద్ధికి
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









