'ఆటాడుకుందాం.. రా' ఆడియో వేడుకను నిన్న గ్రాండ్ గా ...
- August 05, 2016
కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సూపర్హిట్ చిత్రాల హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. అఖిల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనూప్ అందించిన పాటలు శ్రోతలని అలరిస్తున్నాయి. ఈ చిత్రంకోసం నటసామ్రాట్ డా|| అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' చిత్రంలోని ఎవర్గ్రీన్ సాంగ్ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో' పాటని రీమిక్స్ చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా 'ఆటాడుకుందాం.. రా' చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించగా ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్తోపాటు అందర్నీ థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్లు కూడా వున్నాయట . ఇక ఈ చిత్రంలో కథానాయికగా సోనమ్ ప్రీత్ నటించింది. బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







