'ఆటాడుకుందాం.. రా' ఆడియో వేడుకను నిన్న గ్రాండ్ గా ...
- August 05, 2016
కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సూపర్హిట్ చిత్రాల హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. అఖిల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనూప్ అందించిన పాటలు శ్రోతలని అలరిస్తున్నాయి. ఈ చిత్రంకోసం నటసామ్రాట్ డా|| అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' చిత్రంలోని ఎవర్గ్రీన్ సాంగ్ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో' పాటని రీమిక్స్ చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా 'ఆటాడుకుందాం.. రా' చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించగా ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్తోపాటు అందర్నీ థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్లు కూడా వున్నాయట . ఇక ఈ చిత్రంలో కథానాయికగా సోనమ్ ప్రీత్ నటించింది. బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









