దాయిద్లోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా
- August 05, 2016
దాయిద్ మునిసిపాలిటీలోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా విధించారు. నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా గడచిన ఆరు నెలల్లో జరిగిన తనిఖీల అనంతరం ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. దాయిద్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అలి అల్ తునాజి మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాలు, అనుమతి లేకుండా ఫార్మ్స్లో నిర్మాణాలు చేపట్టడం, భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడం, తాత్కాలిక ఫెన్సింగ్ లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడం, అక్రమంగా కన్స్ట్రక్షన్ వేస్ట్ని డంప్ చేయడం, అలాగే నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సైన్ బోర్డ్స్ని వినియోగించకపోవడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు తెలిపారు. ఇంకోవైపున దాయిద్ మునిసిపాలిటీ 335 లైసెన్సులను కన్స్ట్రక్షన్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం మంజూరు చేసిందని, 261 కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ని ఆమోదించిందని, 154 ప్రాజెక్ట్ అకంప్లిష్మెంట్ సర్టిఫికెట్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు. నిర్మాణ రంగానికి మునిసిపాలిటీ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని అయితే ఖచ్చితంగా నిర్మాణ సంస్థలు నిబందనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు అలి అల్ తునాజి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









