సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- April 22, 2026
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ “అజేయుడు” పేరిట రచించిన పుస్తకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థ సారథి మాట్లాడుతూ సీఎం
చంద్రబాబు నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రపదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం మనందరి అదృష్టం అన్నారు. 76 ఏళ్ల వయస్సులోనూ రాష్ట్ర అభివృద్ధి కోసమే తపిస్తున్న చంద్రబాబుపై ఎంత సాహిత్యం వచ్చినా, ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే అన్నారు.
చంద్రబాబు విజన్ ప్రపంచానికే ఆదర్శమని దానిని విశ్వవ్యాప్తం చెయ్యవలసిన బాధ్యత పాత్రికేయులు, రచయితలపై ఉందన్నారు. వెటరన్ జర్నలిస్టుగా ప్రసాద్ ముఖ్యమంత్రి పై మంచి రచనలు చేయడం ముదావహమన్నారు. సహా రచయితగా వ్యవహరించిన సీనియర్ ఫ్రీలన్స్ జర్నలిస్ట్ డాక్టర్ రవి కుమార్ బొప్పన ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వ పటిమపై మంచి వ్యాసాలను రచించి ఈ పుస్తకం లో ప్రచురింప చేశారని మంత్రి కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో కనదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యుడు సతీష్, కృష్ణ జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ జే అరుణ, సీనియర్ తెలుగు దేశం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









