2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- April 22, 2026
దోహా: ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త స్కాలర్షిప్ పథకం.. సమాజంలోని అన్ని వర్గాలలో ప్రతిభ గలవారిని ప్రోత్సహించనుంది. దివ్యాంగులైన విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది.దీంతో వారు ప్రత్యేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చేరడానికి వీలు కలుగుతుందన్నారు.
ఇంకా న్యూక్లియర్ ఇంజనీరింగ్ మరియు క్లినికల్ సైకాలజీ వంటి ప్రాధాన్యతా రంగాలను చేర్చడంతో పాటు హ్యుమానిటీస్ ట్రాక్ విద్యార్థులు శాస్త్రీయ విభాగాల్లోకి మారడానికి వీలు కల్పించే ఒక “బ్రిడ్జింగ్” కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ ద్వారా స్కాలర్షిప్లు, ఎడ్యుకేషన్ సిటీ యూనివర్సిటీ మరియు ప్రైవేట్ యూనివర్సిటీల కోసం ఉద్దేశించిన మొదటి దశ జూలై 1 నుండి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని ప్రకటించింది.
ఇక ఖతార్ యూనివర్సిటీ మరియు ఇతర ప్రభుత్వ యూనివర్సిటీల కోసం కేటాయించిన రెండవ దశ నవంబర్ 15 నుండి డిసెంబర్ 30 వరకు జరుగుతుంద. ప్రవేశాలు మెరిట్ మరియు అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఉంటాయని MoEHE వ్యవహారాల సహాయ అండర్ సెక్రటరీ డాక్టర్ హరేబ్ అల్ జబ్రి వెల్లడించారు.
అదే విధంగా వరుసగా రెండవ సంవత్సరం కూడా ప్రైవేట్ రంగ స్కాలర్షిప్ మార్గాన్ని ప్రారంభించడం అనేది ప్రైవేట్ రంగంలో జాతీయ ప్రతిభలో పెట్టుబడి పెట్టడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని కార్మిక మంత్రిత్వ శాఖలోని ప్రైవేట్ రంగంలో జాతీయ కార్మిక శక్తి వ్యవహారాల సహాయ అండర్ సెక్రటరీ అయిన ఖమీస్ మహమ్మద్ అల్ నుయైమీ పేర్కొన్నారు
ఈ పథకం ఆర్థిక పరంగా మరియు పోటీతత్వ ప్రయోజనాలతో కూడిన సమగ్ర ప్యాకేజీని అందిస్తుందన్నారు. అమీరి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద వైద్య విద్యార్థులు ప్రాథమిక జీతాలు మరియు నెలవారీ ప్రయాణ భత్యాలు పొందుతారని, అయితే పురుష విద్యార్థుల కోసం ఉద్దేశించిన “తోమౌహ్” ప్రోగ్రామ్, సుమారుగా QR23,000 వరకు చేరే పోటీ జీతాలతో తక్షణ ఉద్యోగానికి హామీ ఇస్తుందన్నారు.
వివిధ ప్రోగ్రామ్లలో నెలవారీ స్టైపెండ్లు మారుతూ ఉంటాయి. వీటిలో విదేశాల్లోని అమీరి స్కాలర్షిప్లకు QR20,000, విదేశాల్లోని వైద్య స్పెషలైజేషన్లకు QR18,000 నుండి QR30,000 మధ్య, విదేశాల్లోని న్యూక్లియర్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్లకు QR20,000, పురుష విద్యార్థుల కోసం తోమౌహ్ ప్రోగ్రామ్ కింద సుమారుగా QR23,000, సాధారణ బాహ్య స్కాలర్షిప్లకు సుమారుగా QR14,000, స్పెషలైజేషన్ను బట్టి అంతర్గత స్కాలర్షిప్లకు QR4,000 నుండి 10,000 మధ్య ఉంటాయని తెలిపారు. ఇక అదనపు ప్రయోజనాలలో వివిధ భత్యాలు, వార్షిక ప్రయాణ టిక్కెట్లు, కొన్ని సందర్భాల్లో మొత్తం సర్వీస్ సంవత్సరాలలోకి అధ్యయన సంవత్సరాలను లెక్కించడం వంటివి ఉంటాయని వివరించారుడు.
ఈ ప్లాన్లో మూడు ప్రధాన స్కాలర్షిప్ ట్రాక్లు ఉన్నాయి: ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల కోసం అమీరి స్కాలర్షిప్ ప్రోగ్రామ్, బాహ్య స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఆమోదించబడిన ట్రాక్లు మరియు సంస్థల ఆధారంగా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మరియు గుర్తింపు పొందిన జాతీయ విశ్వవిద్యాలయాలలో అంతర్గత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉన్నాయి. వీటికి అదనంగా, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉపాధి-అనుసంధాన కార్యక్రమాలు కూడా ఉన్నాయని అన్నారు.
ఇది జాతీయ అవసరాలను తీర్చే ప్రాధాన్యతా ప్రత్యేకతలపై దృష్టి పెడుతుందన్నారు. వాటిలో అధునాతన ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్యం మరియు ఆరోగ్య శాస్త్రాలు, మనస్తత్వశాస్త్రం మరియు ప్రవర్తనా ఆరోగ్యం, మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విభాగాలు ఉన్నాయి.
అయితే, దరఖాస్తుదారులు తప్పనిసరిగా కొన్ని అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. వాటిలో ప్రోగ్రామ్ను బట్టి హైస్కూల్లో 75 నుండి 80 శాతం మధ్య సగటు మార్కులు సాధించడం, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి బేషరతు ప్రవేశం పొందడం, బాహ్య స్కాలర్షిప్ల కోసం కనీసం 6.0 IELTS స్కోరు లేదా దానికి సమానమైన స్కోరు సాధించడం, వారు ఎంచుకున్న స్పెషలైజేషన్ మరియు అకడమిక్ ట్రాక్ మధ్య పొంతన ఉండేలా చూసుకోవడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్
- విజయవాడ ‘వివేకానంద’లో సమ్మర్ క్యాంప్!
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం









