కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం

- April 22, 2026 , by Maagulf
కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం

దుబాయ్: నగర రవాణా రంగంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా భావిస్తున్న కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. 42 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ ‘గోల్డ్ లైన్’ మెట్రో ప్రాజెక్ట్ నగరంలోని 15 కీలక ప్రాంతాల గుండా ప్రయాణించి సుమారు 15 లక్షల మంది నివాసితులకు సేవలు అందించనుంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 55 ప్రధాన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు ఈ మెట్రో లైన్ అనుసంధానం కల్పించనుండటంతో నగర కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. మొత్తం AED 34 బిలియన్ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా దుబాయ్ మెట్రో నెట్‌వర్క్ పొడవు 35 శాతం మేర పెరగనుంది.

ఈ ప్రాజెక్ట్‌ను 2032 సెప్టెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దుబాయ్‌ను ప్రపంచంలో నివసించడానికి ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే దిశగా ఇలాంటి కీలక ప్రాజెక్ట్‌లు ముందుకు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.

భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని, లక్షలాది ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com