మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- April 22, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ మనీ మరియు ఆన్లైన్ గేమింగ్ వల్ల ప్రతి సంవత్సరం సుమారు 45 కోట్ల మంది ఆర్థికంగా నష్టపోతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వాటిని నియంత్రించేందుకు భారీ నిర్ణయం తీసుకుంది. ఏటా సుమారు రూ. 20,000 కోట్ల మేర సామాన్యుల సొమ్ము హారతి కర్పూరం అవుతుండటంతో, ప్రభుత్వం ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో పనిచేసేలా ‘ఆన్లైన్ గేమింగ్ అథారిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.MeitY అదనపు కార్యదర్శి ఈ అథారిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు.హోం శాఖ, ఆర్థిక సేవలు, సమాచార ప్రసారాలు, క్రీడలు మరియు న్యాయ శాఖల జాయింట్ సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు.
2025 నాటి ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టంలో సవరణలు మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి.ఈ అథారిటీ ఐటీ శాఖ కింద ఒక డిజిటల్ ఆఫీస్గా పనిచేస్తూ, ఈ-స్పోర్ట్స్ సహా అన్ని రకాల ఆన్లైన్ గేమ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.డేటా రిటెన్షన్ మరియు ఇతర కఠిన మార్గదర్శకాలను జారీ చేసే పూర్తి అధికారం ఈ సంస్థకు ఉంటుంది.
కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. సోషల్ గేమింగ్ లేదా ఈ-స్పోర్ట్స్ సేవలను అందించాలనుకునే కంపెనీలు కచ్చితంగా ఈ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనివల్ల బాధ్యతాయుతమైన గేమింగ్ సంస్కృతి పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, యువత మరియు సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకే ఈ నిషేధం మరియు నియంత్రణ విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
కొన్ని రకాల గేమ్లకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరమని నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నాయి. పెద్ద సంఖ్యలో యూజర్లు పాల్గొనే గేమ్లు, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్నవి, అధిక ప్రమాదకరంగా పరిగణించే వాటికి ఇది వర్తిస్తుంది. ఆన్ లైన్ గేమింగ్ కార్యకలాపాలను నియంత్రించడం, నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడే సంస్థపై చర్యలు తీసుకోవడం వంటివి ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయి.
తాజా వార్తలు
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!







