తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- April 22, 2026
తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు దక్కాయి. వీరంతా 1995, 1996 బ్యాచ్ లకు చెందిన ఐపీఎస్ అధికారులు.., ప్రమోషన్ లు పొందిన అధికారుల్లో వీవీ శ్రీనివాస్ రావు (1995బ్యాచ్), స్వాతిలక్రా (1995 బ్యాచ్), మహేశ్ భగవత్ (1995 బ్యాచ్), చారుసిన్హా (1996 బ్యాచ్) డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్), వీసీ సజ్జనార్ (1996 బ్యాచ్) ఉన్నారు.
వీరంతా అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం (ఏప్రిల్ 22) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం మహేశ్ భగవత్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్నారు. స్వాతిలక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఇన్నాళ్లు కొనసాగుతున్నారు. వీవీ శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి చైర్మన్ గా ఉన్నారు. చారుసిన్హా సీఐ మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉన్నారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









