శంషాబాద్ ఎయిర్పోర్టులో పూర్తిస్థాయిలో బందోబస్తు..
- August 05, 2016
పంద్రాగస్టు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు వేడకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఎయిర్పోర్టులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అక్టోపస్ బృందాలు, సీఐఎస్ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు శంషాబాద్ ఎయిర్పోర్టులో మోహరించారు.ఎయిర్పోర్టులోని ముఖ్యమైన ప్రాంతాల్లో డాగ్స్క్వాడ్స్తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలోకి వెళ్లే పాస్లను రద్దు చేశారు. ఈనెల 25వరకు సందర్శకుల విజిటర్స్ పాసుల జారీని నిలిపివేశారు. మొత్తానికి ఎయిర్పోర్టులో సీఆర్పీఎఫ్, ఆక్టోపస్, ఎయిర్పోర్టు సెక్యూరిటీతో మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







