అగ్రనేతల మధ్య ముదిరిన విభేదాలు
- April 25, 2026
అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపడానికి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇరాన్ అగ్రనేతల మధ్య వ్యూహాత్మక వైఖరిపై తీవ్రమైన భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వంలో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఈ బృందం అమెరికాతో చర్చల్లో కొంత సరళతరమైన వైఖరిని అవలంభించాలని, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రాజీ పడాలని భావిస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ అహ్మద్ వాహిది నేతృత్వంలోని ఈ బృందం అమెరికా పట్ల కఠినంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచకూడదని పట్టుబడుతోంది.
అమెరికాకు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’ (ISW) విశ్లేషణ ప్రకారం, ఈ అంతర్గత పోరులో ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిది విజేతగా నిలిచారు. చర్చల బృందంపై తన పట్టును నిరూపించుకుంటూ, అమెరికాతో రాజీపడని వైఖరిని ప్రదర్శించేలా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ఘాలిబాఫ్ ప్రతిపాదించిన రాయితీలను వాహిది బృందం పదేపదే అడ్డుకోవడంతో మితవాద వర్గం డీలా పడింది. అంతర్గత విభేదాలు మరియు ఐఆర్జీసీ ఆధిపత్యంతో విసుగు చెందిన స్పీకర్ ఘాలిబాఫ్ తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాకు ఇచ్చే మినహాయింపుల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆయన ఇప్పటికే చర్చల బృందం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







