ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..

- April 25, 2026 , by Maagulf
ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో పాటు ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కేవలం రాయలసీమలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. కోస్తాంధ్రలోనూ ఎండల తీవ్రత పెరిగింది. రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com