ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- April 25, 2026
లింక్డ్ఇన్ విడుదల చేసిన ‘ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026’ ప్రకారం, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోంది. భారతదేశంలో ఏఐ ఇంజనీరింగ్ నియామకాలు గతేడాదితో పోలిస్తే (YoY) 59.5% వృద్ధిని సాధించాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా ఇది అత్యధికం కావడం విశేషం. ఒకప్పుడు కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ ఏఐ విప్లవం, ఇప్పుడు విజయవాడ (+45.5%) వంటి వర్ధమాన నగరాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇది టైర్-2 మరియు టైర్-3 నగరాల్లో నివసించే సాంకేతిక నిపుణులకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. మౌలిక సదుపాయాలు మరియు ఏఐ పాలనా విధానాలపై భారీ సంస్థలు పెడుతున్న పెట్టుబడులే ఈ వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది.
ఎస్ఎంబిలు మరియు తయారీ రంగంలో ఏఐ ప్రకంపనలు
భారీ సంస్థలతో పాటు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు (SMBs) కూడా ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు, ఏఐ ప్రొడక్టివిటీ మరియు అజూర్ ఏఐ స్టూడియో వంటి ఆచరణాత్మక నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. తయారీ రంగంలో ఏఐ ఇంజనీరింగ్ నిపుణుల సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ప్రయోగాల దశ నుండి ఏఐని నిత్య పనివిధానాల్లోకి అమలు చేసే ఆచరణాత్మక దశకు పరిశ్రమలు మారుతున్నాయి. ఏఐ ఏజెంట్లు మరియు ఆటోమేటెడ్ ఫీచర్ ఇంజనీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగ విపణిలో బ్రహ్మరథం పడుతున్నారు.
భవిష్యత్తు అవకాశాలు–నిపుణులకు సూచనలు
ఏఐ రంగంలో వస్తున్న ఈ మార్పులను ఇంజనీర్లు అందిపుచ్చుకోవాలని లింక్డ్ఇన్ ఇండియా ఇంజనీరింగ్ హెడ్ మలై లక్ష్మణన్ సూచించారు. కేవలం సిద్ధాంత పరమైన జ్ఞానం కంటే, వాస్తవ ప్రపంచ సమస్యలను ఏఐ ద్వారా ఎలా పరిష్కరించవచ్చో చూపగలిగే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ ప్రాంప్టింగ్, ఇంటెలిజెంట్ ఏజెంట్స్ వంటి నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా కెరీర్ను భవిష్యత్తుకు సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. నిపుణులు తమ నైపుణ్యాలను ధృవీకరించుకోవడానికి లవబుల్ (Loveable) లేదా రెప్లిట్ (Replit) వంటి సాధనాలను ఉపయోగించడం వల్ల యజమానుల దృష్టిలో త్వరగా పడే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







