సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- April 26, 2026
రియాద్ః సౌదీ భద్రతా అధికారులు గత వారంలో మొత్తం 12,192 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 22 మధ్య కాలంలో వివిధ శాఖల సమన్వయంతో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీల సందర్భంగా ఈ అరెస్టులు జరిగినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 6,606 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 3,510 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 2,076 మంది ఉన్నారు.
ఇక అనుమతి లేకుండా సౌదీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ అరెస్టు అయిన వారి సంఖ్య మొత్తం 1,454గా ఉంది. వీరిలో 32 శాతం మంది యెమెన్ జాతీయులు, 67 శాతం మంది ఇథియోపియా జాతీయులు మరియు ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం 17,368 మంది అక్రమ నివాసితులను దేశం నుండి బహిష్కరించారు (deport చేశారు). అదేవిధంగా, సౌదీ చట్టాలను ఉల్లంఘించిన వారికి ఆశ్రయం, రవాణా మరియు ఉపాధి కల్పించడంలో సహకరించిన సుమారు 22 మందిని అధికారులు అరెస్టు చేశారు.
అక్రమ నివాసితులకు ఆశ్రయం లేదా మరే ఇతర సహాయం గానీ, సేవ గానీ అందించినా... అటువంటి వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష మరియు గరిష్టంగా 1 మిలియన్ సౌదీ రియాల్స్ (SR) జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబరుకు, అలాగే మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనల కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







