షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- April 27, 2026
యూఏఈః అక్రమంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పలు మోసాలకు పాల్పడుతున్న ఒక క్రిమినల్ నెట్వర్క్ను షార్జా పోలీసులు ఛేదించారు. ఒకే తరహా మోసాలపై అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టి, నలుగురు ఆఫ్రికన్ అనుమానితులను అరెస్టు చేశారు. ఆ ముఠా మొత్తం 3 మిలియన్ దిర్హమ్స్ వరకు మోసాలకు పాల్పడినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ ఖలీఫా అల్ బుహైర్ తెలిపారు.
ఈ ముఠా షిప్పింగ్ మరియు బీమా కంపెనీల మాటున పార్శిళ్లు క్లియరెన్స్ పేరిట బాధితులను నమ్మించి, కస్టమ్స్ ఫీజులు లేదా బీమా ఛార్జీల వంటి సాకులతో డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఒక షిప్పింగ్ బీమా కంపెనీకి సంబంధించిన డేటాను ఈ ముఠా చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ డేటా సాయంతో నిందితులు పలువురిని మోసం చేసినట్లు వెల్లడించారు. నేరస్థులకు అంతర్జాతీయంగా కూడా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైందని వివరించారు.
ఒక నిందితుడు విదేశాల నుండి కార్యకలాపాలను నిర్వహిస్తూ ఇతరులకు ఆదేశాలు జారీ చేసేవాడని, యూఏఈలో ఉన్నవారు నిధులను సేకరించి, ఏటీఎంల నుండి నగదును విత్డ్రా చేసుకునేవారని తెలిపారు.
అలాగే, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ ఖాతాల ద్వారా బాధితులను ఆకర్షించడానికి, వారిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి నిందితులు మహిళల పేర్లు మరియు ఫోటోలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. ఆన్ లైన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు నివాసితులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







