ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- April 27, 2026
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సేవలను విస్తరించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా గ్రామాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన గ్రామాలకు కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. మహిళల అభివృద్ధి, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కాలుష్యం తగ్గించేందుకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







