దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- April 27, 2026
యూఏఈః దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులను నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MOE) మరియు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఆమోదం తెలిపాయి.
దీంతో ఈ వారం నుండి దశలవారీగా ఔట్ డోర్ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని పలు విద్యాసంస్థలు తల్లిదండ్రులకు పంపిన సర్క్యులర్ లో తెలియజేశాయి. ప్రస్తుత స్థిరమైన పరిస్థితులు మరియు అధికారిక మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.పీఈ క్లాసులతోపాటు ఇతర విద్యా కార్యకలాపాలు ఏప్రిల్ 27నుండి దశలవారీగా అనుసరిస్తున్నాయని తెలియజేశాయి. ఏప్రిల్ 20 నుండి దుబాయ్లోని స్కూల్స్ దశలవారీగా తిరిగి ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడంపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







