హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- April 27, 2026
అనంతపురం: జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు పెద్ద సంచలనానికి దారితీసింది. ఈ కేసులో పోలీసు సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.
అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్లను సర్వీసు నుంచి తొలగించారు.
అదే విధంగా అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్లను సస్పెండ్ చేశారు. మరోవైపు అనంతపురం రూరల్ సీఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను రిమాండ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, 2 కత్తులు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
హనీట్రాప్ ముఠాతో పోలీసుల సంబంధాలు బయటపడటాన్ని అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ తీవ్రంగా పరిగణించారు. పెద్ద సంఖ్యలో బాధితులు ముందుకు రావడం, ముఖ్యంగా పోలీసు శాఖలోనే ఉన్న కొందరు అధికారుల ప్రమేయం నిర్ధారణ కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









