హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- April 27, 2026
అనంతపురం: జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు పెద్ద సంచలనానికి దారితీసింది. ఈ కేసులో పోలీసు సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.
అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్లను సర్వీసు నుంచి తొలగించారు.
అదే విధంగా అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్లను సస్పెండ్ చేశారు. మరోవైపు అనంతపురం రూరల్ సీఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను రిమాండ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, 2 కత్తులు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
హనీట్రాప్ ముఠాతో పోలీసుల సంబంధాలు బయటపడటాన్ని అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ తీవ్రంగా పరిగణించారు. పెద్ద సంఖ్యలో బాధితులు ముందుకు రావడం, ముఖ్యంగా పోలీసు శాఖలోనే ఉన్న కొందరు అధికారుల ప్రమేయం నిర్ధారణ కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







