హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- April 27, 2026
అనంతపురం: జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు పెద్ద సంచలనానికి దారితీసింది. ఈ కేసులో పోలీసు సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.
అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్లను సర్వీసు నుంచి తొలగించారు.
అదే విధంగా అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్లను సస్పెండ్ చేశారు. మరోవైపు అనంతపురం రూరల్ సీఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను రిమాండ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, 2 కత్తులు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
హనీట్రాప్ ముఠాతో పోలీసుల సంబంధాలు బయటపడటాన్ని అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ తీవ్రంగా పరిగణించారు. పెద్ద సంఖ్యలో బాధితులు ముందుకు రావడం, ముఖ్యంగా పోలీసు శాఖలోనే ఉన్న కొందరు అధికారుల ప్రమేయం నిర్ధారణ కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







