అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!

- April 27, 2026 , by Maagulf
అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
మస్కట్: ఇటీవలి పరిణామాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో దౌత్యపరమైన చర్చలు జరిపారు. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించిన ప్రస్తుత స్థితిపై సమీక్షించారు.
సయ్యద్ బదర్ సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఖతార్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ, ఈజిప్టుకు చెందిన బదర్ అబ్దెలాటీ, కెనడాకు చెందిన అనితా ఆనంద్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన యెవెట్ కూపర్, నెదర్లాండ్స్‌కు చెందిన టామ్ బెరెండ్‌సెన్ మరియు ఉక్రెయిన్‌కు చెందిన ఆండ్రీ సిబిహాలతో చర్చలు జరిపారు.
మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అమెరికా -ఇరాన్ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com