బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- April 27, 2026
కువైట్: బీమా రంగంలో పారదర్శకతను మరియు ఆర్థిక పర్యవేక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో కువైట్ బీమా నియంత్రణ విభాగం తన పర్యవేక్షణలో ఉన్న అన్ని సంస్థలలో నగదు లావాదేవీలపై నిషేధం విధించారు.
కొత్త నిర్ణయం ప్రకారం, బీమా కంపెనీలు మరియు లైసెన్స్ పొందిన సంస్థలు ఎలాంటి నగదు చెల్లింపులను స్వీకరించడం లేదా నిర్వహించడం కుదరదు. బదులుగా, ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా అన్ని ఆర్థిక లావాదేవీలు తప్పనిసరిగా బ్యాంకింగ్ లేదా కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారానే జరగాలి.
అయితే, కొన్ని తప్పనిసరి వాహన బీమా లావాదేవీలకు, సరిహద్దులో వ్యక్తిగత బీమా పత్రాలకు పరిమిత మినహాయింపును ప్రకటించారు.
ముఖ్యంగా మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి కువైట్ విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ మేరకు నిషేధం విధించినట్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







