ఎంసెట్‌-2 రాసిన వారంతా సెంసెట్‌-3 రాసేందుకు అర్హులే..

- August 06, 2016 , by Maagulf
ఎంసెట్‌-2 రాసిన వారంతా సెంసెట్‌-3 రాసేందుకు అర్హులే..

సెప్టెంబరు 11న జరగనున్న తెలంగాణ ఎంసెట్‌-3 పరీక్షకోసం కొత్త హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్‌-2 రాసిన వారంతా సెంసెట్‌-3 రాసేందుకు అర్హులేనని, పాత రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగానే హాల్‌టికెట్లు ఇస్తామని కన్వీనర్‌ యాదయ్య తెలిపారు. హాల్‌టికెట్‌ సంఖ్య, పరీక్షా కేంద్రాలు మారతాయని చెప్పారు. కొత్త హాల్‌ టికెట్లను సెప్టెంబరు 3 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎంసెట్‌-3 కన్వీనర్‌ యాదయ్య తెలిపారు. ఎంసెట్‌-3 నిర్వహణ కమిటీ ఇవాళ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంసెట్‌-3 విధివిధానాలు, పూర్తి షెడ్యూల్‌ వివరాలతో ఈనెల 8న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌-3 వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని కన్వీనర్‌ తెలిపారు. బయోమెట్రిక్‌ ఇతర నిబంధనలు గతంలో మాదిరిగానే ఉంటాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com