రద్దీ ప్రాంతాల్లోనే ఎక్కువ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

- August 06, 2016 , by Maagulf
రద్దీ ప్రాంతాల్లోనే ఎక్కువ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

కమర్షియల్‌ స్ట్రీట్స్‌, అలాగే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా వాహనం నడుపుతూ మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించడం, డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వంటివి చేస్తున్నారు వాహనదారులు. ఈ విషయాల్ని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, మీడియా అండ్‌ ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మేజర్‌ జబెర్‌ మొహమ్మద్‌ రషీద్‌ ఒదైబా వివరించారు. ఈ నేపథ్యంలో మరింత ఎక్కువగా ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహనా కార్యక్రమాల్ని చేపడ్తామని ఆయన అన్నారు. అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌లో ముఖ్య ఉద్దేశ్యం ప్రమాదాల్ని తగ్గించడమేనని ఆయన వెల్లడించారు. జులై 24న ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌ ఈ వేసవి అంతా కొనసాగనుంది. సీట్‌ బెల్ట్‌ వినియోగించకపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారనీ, సీట్‌ బెల్ట్‌ వినియోగిస్తే ప్రమాదాలు జరిగినా చిన్న చిన్న గాయాలతో బయటపడవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com