శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..

- April 28, 2026 , by Maagulf
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భక్తులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొండపై ఉన్న బిగ్ క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా సామాన్య భక్తులకు తక్కువ సమయంలో నాణ్యమైన భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా వసతులు పెంచడమే లక్ష్యంగా టీటీడీ అడుగులు వేస్తోంది.

కొండ పై ఉండే హోటల్ యజమానులు టీటీడీ నిర్దేశించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. హోటల్ సిబ్బంది అంతా నిర్ణీత డ్రెస్ కోడ్ ధరించాలని సూచించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని హెచ్చరించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ముడి పదార్థాలనే వంటల్లో వాడాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

తిరుమల పవిత్రతను కాపాడుతూ కేవలం సంప్రదాయ ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. బయట దొరికే జంక్ ఫుడ్స్ కాకుండా మన సంస్కృతిని ప్రతిబింబించే ఆహారాన్ని భక్తులకు అందించాలని హోటల్ నిర్వాహకులకు చెప్పారు. ధరల విషయంలో కూడా భక్తులపై భారం పడకుండా చూడాలని కోరారు. త్వరలోనే ఈ క్యాంటీన్లు పూర్తిస్థాయిలో భక్తుల ఆకలి తీర్చడానికి సిద్ధం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com