శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- April 28, 2026
తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భక్తులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొండపై ఉన్న బిగ్ క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా సామాన్య భక్తులకు తక్కువ సమయంలో నాణ్యమైన భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా వసతులు పెంచడమే లక్ష్యంగా టీటీడీ అడుగులు వేస్తోంది.
కొండ పై ఉండే హోటల్ యజమానులు టీటీడీ నిర్దేశించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. హోటల్ సిబ్బంది అంతా నిర్ణీత డ్రెస్ కోడ్ ధరించాలని సూచించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని హెచ్చరించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ముడి పదార్థాలనే వంటల్లో వాడాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
తిరుమల పవిత్రతను కాపాడుతూ కేవలం సంప్రదాయ ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. బయట దొరికే జంక్ ఫుడ్స్ కాకుండా మన సంస్కృతిని ప్రతిబింబించే ఆహారాన్ని భక్తులకు అందించాలని హోటల్ నిర్వాహకులకు చెప్పారు. ధరల విషయంలో కూడా భక్తులపై భారం పడకుండా చూడాలని కోరారు. త్వరలోనే ఈ క్యాంటీన్లు పూర్తిస్థాయిలో భక్తుల ఆకలి తీర్చడానికి సిద్ధం కానున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







