లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం

- April 28, 2026 , by Maagulf
లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం

హైదరాబాద్: లొంగిపోయిన మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మావోయిస్టులకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది.

భద్రాచలం, ములుగు అటవీ ప్రాంతాల పై అవగాహన ఉన్న 20 మందిని టూరిజం గైడ్స్‌గా నియమించాలని నిర్ణయించింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి, యూనిఫామ్ కూడా అందించనుంది.

ఈ చర్య ద్వారా మరింత మంది మావోయిస్టులు లొంగిపోయేలా ప్రోత్సాహం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే నియామక పత్రాలు అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com